3,251 సర్పంచ్ స్థానాలకు 19,491 మంది నామినేషన్లు

Update: 2021-02-01 05:55 GMT

3,251 సర్పంచ్ స్థానాలకు 19,491 మంది నామినేషన్లు

ఏపీలో తొలివిడత పల్లెపోరుకు నామినేషన్ల పర్వం ముగిసింది. తొలివిడతలో 3వేల 251 సర్పంచ్ స్థానాలకు, 79 వేల 799 వార్డ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 3 వేల 251 సర్పంచ్ స్థానాలకు గానూ, 19 వేల 4వందల 91 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 32 వేల 5వందల 22 స్థానాలకు 79వేల 7వందల 99 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాల్టీ నుంచి నామినేషన్లు పరిశీలన జరగనున్నాయి.

మొదటి రోజు సర్పంచ్ 1,313, వార్డుమెంబర్లు 2,201 నామినేషన్లు దాఖలు చేశారు. రెండవ రోజు సర్పంచ్‌కు 7, 462, వార్డు మెంబర్ 23వేల 342 మంది నామినేషన్లు వేశారు. చివరి రోజు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి. సర్పంచ్‌కు 10వేల 715, వార్డులకు 54వేల 256 మంది నామినేషన్లు వేశారు.

Tags:    

Similar News