వానరాల మధ్య ఫ్యాక్షన్ ఫైట్..రెండు గ్రూపులుగా విడిపోయి కీచులాట

Update: 2019-08-14 11:21 GMT

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిజం తగ్గిపోయింది. కానీ వానరాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు మొదలయ్యాయి. కళ్యాణదుర్గం పట్టణం దీనికి వేదికైంది. రెండు గ్రూపులుగా విడిపోయిన కోతులు రోడ్డుపైకి వచ్చాయి. ఇటువైపు కొన్ని అటువైపు మరికొన్ని వానరాలు గ్రూపులుగా విడిపోయాయి. కీచులాటలు గాండ్రింపులతో కిష్కింధకాండ మొదలు పెట్టాయి. సుమారు 20 నిమిషాల పాటు సవాల్ ప్రతి సవాల్ విసురుకున్నాయి. ఒక గ్రూపు నుంచి కొన్ని మరో గ్రూపు నుంచి కొన్ని వానరాలు ముందుకు దూసుకువచ్చి కీచులాట పెట్టుకున్నాయి. మనుషుల్లాగే కోతులు గ్రూపు తగాదాలకు దిగడం పట్టణవాసులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Full View 

Tags:    

Similar News