అనంతపురంలో విషాదం.. ఇద్దరు కుమారులను చంపిన తండ్రి

Update: 2020-10-15 09:36 GMT

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సొంత కొడుకులను తండ్రే కడతేర్చిన ఘటన బోయిలపల్లిలో వెలుగుచూసింది. రవి అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులను తీవ్రంగా కొట్టి చంపాడు. అనంతరం గ్రామ శివారులోని అటవీప్రాంతంలో వారిని పూడ్చిపెట్టాడు. అయితే.. తండ్రి రవికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతోనే దారుణానికి ఒడిగట్టాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Tags:    

Similar News