Chinta Mohan: వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం అవ్వాలి

Chinta Mohan: వచ్చె ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం అవ్వాలని డిమాండ్

Update: 2021-11-18 09:37 GMT

మాజీ ఎంపీ చింత మోహన్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Chinta Mohan: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కోటి మంది జనాభా ఉన్న కాపులు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. 70 ఏళ్లలో కాపులు ఒక్కరు కూడా సీఎం కాలేదని వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం అవ్వాలని డిమాండ్ చేశారు. దేశంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులు అధ్వాన్నంగా మరాయని ఆరోపించారు. రాష్ట్రంలో 80 లక్షల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్ షిప్పులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. అంతేకాక స్కాలర్ షిప్పులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

Tags:    

Similar News