వైసీపీలో చేరిన నీరజారెడ్డి

Update: 2019-03-16 16:27 GMT

ఆలూరు మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పిన జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 2009 లో కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు నీరజారెడ్డి.

కాగా తన నియోజకవర్గంలో పనులు జరగడంలేదంటూ 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారామే.. అప్పట్లో నీరజారెడ్డి రాజీనామా చేయడం పలు చర్చలకు దారితీసింది. కానీ.. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె వైసీపీ గూటికే చేరారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. 

Similar News