వైకాపా మార్క్ దోపిడీ యధావిధిగా కొనసాగుతోంది : నారా లోకేష్

Update: 2019-11-19 12:34 GMT

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యపాన నిషేధం అమలుపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. మద్యపాన నిషేధం కోసం గారు 'మంద'డుగు వేస్తూనే ఉన్నారని అన్నారు.. దాని ఫలితమే కాబోలు.. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో బెల్టు షాపులు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయన్న లోకేష్..

జగనన్న మద్యం దుకాణాల్లో రేటు పెంచి వైకాపా మార్క్ దోపిడీని యధావిధిగా కొనసాగిస్తున్నారని అన్నారు. ఇలా జరుగుతున్నా షాపులు తగ్గించాం, బార్లు తగ్గించడానికి శ్రమిస్తున్నాం అంటూ సీఎం ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ సూటిగా అడుగుతున్నా.. గతంలో కంటే ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా చెప్పండి జగన్ గారు అంటూ సీఎంను ప్రశ్నించారు లోకేష్. 

Tags:    

Similar News