టీటీడీ పాలకమండలి ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. సభ్యుల సంఖ్యను 19 నుంచి 29 మందికి పెంచుతూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆర్డినెన్స్ జారీ చేశారు. పాలకమండలి సభ్యులు రేపు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైర్మన్ సహా 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి 29 మంది బోర్డు సభ్యులుగా ఉండనున్నారు. గతంలో ప్రతిపాదించిన విధంగా తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్కు బోర్డులో చోటు కల్పించలేదు.