AP Elections 2020: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీం కోర్టులో విచారణ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనపై.. రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Update: 2020-03-18 04:07 GMT
YS Jagan (File Photo)

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనపై.. రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. సీజేఐ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఉత్తర్వులు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో కోరింది.


Full View



Tags:    

Similar News