చిత్తూరు జిల్లాలో మరో ఏనుగు మృతి చెందింది. పలమనేరు మున్సిపాల్టీ పరిధిలో మరో ఏనుగు మరణించింది. గొబ్బిళ్ల కొట్టూరులో పంటపొలం దగ్గర ఓ ఏనుగు పిల్ల కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన పిల్ల ఏనుగు కోసం అడివిలో ఉన్న తల్లి ఏనుగు పరుగులు తీస్తూ వచ్చింది. చనిపోయిన ఏనుగు చుట్టూ తల్లి ఏనుగు తిరుగుతుండటాన్ని చూసిన వారు కంటతడిపెట్టుకున్నారు.
వారం రోజుల వ్యవధిలోనే చిత్తూరు జిల్లాలో రెండు ఏనుగులు మరణించాయి. చెత్తపెంట గ్రామం వద్ద ఓ ఆడ ఏనుగు చనిపోయిన వారం రోజులకే పలమనేరు మున్సిపాల్టీ పరిధిలో ఏనుగు పిల్ల చనిపోయింది. అటవీ శాఖ అధికారులు ఏనుగు చనిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. మరో వైపు ఏనుగుల గుంపు ఎప్పుడు స్వైరవిహారం చేస్తాయో నని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.