అనంతపురం జిల్లా పెనుకొండ హైవేపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఇంద్ర బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంద్ర బస్సు నంద్యాల నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.