అమ్మావారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది : ఏపీ డీజీపీ
విజయవాడలో వైభవంగా దసరా వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా చివరిరోజు అమ్మవారు రాజరాజేశ్వరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని భక్తులతోపాటు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దర్శించుకున్నారు.
విజయవాడలో వైభవంగా దసరా వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా చివరిరోజు అమ్మవారు రాజరాజేశ్వరిదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని భక్తులతోపాటు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ.. అమ్మావారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తుల సంఖ్య గతంలో కంటే ఇప్పుడు పెరిగిందని. భక్తులకు ఏటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని తెలిపారు. అలాగే ఏపీ పోలీసుల తరపున రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.