దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు. ఇవాళ టీడీపీకి గుడ్ బై చెప్పిన దేవినేని అవినాష్ తెలుగు యువత అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. సీఎం జగన్ను ఆయన నివాసంలో కలుసుకున్న అవినాశ్ ఆయన సమక్షంలో పార్టీ కండువా మార్చుకున్నారు. అవినాష్తో పాటు కడియాల బుచ్చిబాబు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.