ఏపీ అసెంబ్లీలో బడ్జెట్పై రెండో రోజు కూడా చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం బడ్జెట్కు అనుమతించనున్నారు. ప్రశ్నోత్తరాల్లో పలు కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, ఆరోగ్యశ్రీ వ్యాధుల వివరాలు .. సదావర్తి సత్రం భూముల అవకతవకలు, విశాఖలో గృహాల కొరత .. ఐటీ సంస్ధల్లో ఉపాధి, రైతులకు ధరల స్ధిరీకరణ నిధిపై సభ్యులు ప్రశ్నించనున్నారు.