ఆ విషయంపై సీబీఐ విచారణకు ఆదేశించేందుకు కేంద్రం సిద్ధం: పురందేశ్వరి

Update: 2019-07-16 14:15 GMT

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాదనే విషయం తెలిసినా వైసిపి ప్రజలను మభ్యపెడుతోందన్నారు బిజెపి నేత, మాజీ కేంద్రమమంత్రి పురంధరేశ‌్వరి. హోదా ఇవ్వలేమని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేసినా ఇంకా హోదా గురించి ఆలోచించడం అర్ధరహితమన్నారు. ప్రత్యేక ప్యాకేజిని ప్రజలు తిరస్కరించలేదని.. నేతలే ప్యాకేజి ప్రయోజనాలను ప్రజలకు చేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. పోలవరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణకు ఆదేశించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, తమ పార్టీలో చేరేందుకు చాలా మంది నాయకులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పురందేశ్వరి ప్రసంగించారు. 

Tags:    

Similar News