పంచాయతీ ఎన్నికలకు సీఎం సహకరించాలి : రామకృష్ణ

Update: 2021-01-23 10:30 GMT

పంచాయతీ ఎన్నికలకు సీఎం సహకరించాలి : రామకృష్ణ


పంచాయతీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సిఎం సహకరించాలని హితవు పలికారు. గతంలో జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగలేదని ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు. ఉద్యోగ సంఘాలు విజ్ఞతగా ఆలోచించి ఈసీకి సహకరించలని కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ లౌకికవాది. మతోన్మాద పార్టీ అయిన బీజేపీతో జనసేన కలిసి ఉండడం సరైంది కాదన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి బయటకు రావాలని కోరారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతేరేకంగా ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి ట్రాక్టర్లపై నిరసన ప్రదర్శన చేపడుతున్నామన్నారు రామకృష్ణ.
Tags:    

Similar News