ఏపీలో మరో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో 31 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో 31 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 31 కోవిడ్ -19 కేసులు, ఒక మరణం నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 603 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 42 మంది డిశ్చార్జ్ కాగా మరణాల సంఖ్య 15 గా ఉంది.
ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో 546 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి.
♦ అంనంతపురం 26,
♦ చిత్తూరు 30,
♦ తూర్పు గోదావరి 19,
♦ గుంటూరు 126,
♦ కడప 37,
♦ కృష్ణ 70,
♦ కర్నూల్ 129,
♦ నెల్లూరు 67,
♦ ప్రకాశం 44,
♦ విశాఖపట్నం 20,
♦ పశ్చిమ గోదావరి 35 గా ఉన్నాయి.