ఏపీలో మరో కరోనా పాజిటివ్.. కర్నూలులో వ్యక్తి మృతి

ఏపీలో పెరిగిన క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఈ రోజు ఉద‌యం ఒక కేసు న‌మోద‌య్యింది.

Update: 2020-04-07 06:46 GMT
Representational Image

ఏపీలో పెరిగిన క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఈ రోజు ఉద‌యం ఒక కేసు న‌మోద‌య్యింది. గుంటూరు జిల్లాలో కాంటాక్ట్ పాజిటివ్ కేసు వెలుగు చూసింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాటిజివ్ కేసులుసంఖ్య 304 కు చేరింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఒక‌రు మృతి చెందారు. సోమ‌వారం రాత్రి నుంచి ఈ రోజు తొమ్మిది గంట‌ల వ‌ర‌కు ఒక కేసు న‌మోదైంది.

క‌ర్నూలు జిల్లాలో అత్య‌ధికంగా 74 కేసులు న‌మోదైయ్యాయి. క‌ర్నూలు జిల్లాలో క‌రోనా వైర‌స్ వ‌లన‌ ఒకరు మ‌ర‌ణించారు. నెల్లూరులో(42), కృష్ణ జిల్లా(29), విశాఖ‌ప‌ట్నం( 20)క‌డ‌ప (27) గుంటూరు(33), చిత్తూరు(17), ప్ర‌కాశం(24), తూర్పుగోదావ‌రి(11), ప‌శ్చిమ‌గోదావ‌రి(21), అనంత‌పురం(6), న‌లుగురు మ‌ర‌ణించ‌గా.. ఆరుగురు కోలుకున్నారు.




 


Tags:    

Similar News