ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు, విజయవాడల్లో పలు కరోనా అనుమానిత వ్యక్తులు ఆస్పత్రుల్లో చేరారు. విజయవాడకు చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ యువకుడుని నగరంలోని కొత్త ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీజీహెచ్ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుడు ఇటీవల జర్మనీ నుంచి విజయవాడకు వచ్చినట్లు తెలుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కరోనా అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. 10 రోజుల క్రితం కువైట్ నుంచి ఓ వ్యక్తి తణుకుకు వచ్చారు. కొద్ది రోజల నుంచి అతడు జలుబు, దగ్గు, శ్వాస తీర్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాడు. ఇవే లక్షణాలు మరో వ్యక్తిలో కనిపించాయి. కరోనా అనుమానంతో తణుకు నుంచి ఏలూరు ఆసుపత్రికి తరలించారు.