AP News: మంత్రివర్గంలో రెడ్డి కోటా భర్తీలో జగన్‌కు తలనొప్పులు

AP News: బాలినేని, రోజా, పిన్నెల్లికి సారీ చెప్పిన జగన్!

Update: 2022-04-10 11:29 GMT

మంత్రివర్గంలో రెడ్డి కోటా భర్తీలో జగన్‌కు తలనొప్పులు

AP News: మంత్రివర్గంలో రెడ్డి కోటా భర్తీలో జగన్‌కు తలనొప్పులు తప్పడం లేదు. బాలినేని, రోజా, పిన్నెల్లికి సీఎం జగన్ సారీ చెప్పినట్లు సమాచారం. కొందరు అలకబూనడంతో జగన్ సజ్జలను రాయబారానికి పంపారు. రెడ్డి కోటాలో పెద్దిరెడ్డి, బుగ్గన, కాకాణికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఛాన్స్‌ కోసం సజ్జల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు చేస్తున్నారు. బాలినేనిని బుజ్జగించే పనిలో పడ్డారు సజ్జల. బాలినేని నివాసానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులు రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News