Penamaluru: టీడీపీ కార్యకర్తల ఆందోళన
Penamaluru: కృష్ణా జిల్లా పెనమలూరులో టీడీపీ కార్యకర్తల ఆందోళన
Penamaluru: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ టికెట్ బోడె ప్రసాద్కు కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో బోడే ప్రసాద్కు టికెట్ కేటాయించడంలేదనే ప్రచారం జరుగుతుండడంతో నియోజకవర్గ కార్యకర్తలు బోడే ప్రసాద్ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రసాద్కే సీటు ఇవ్వాలని కార్యకర్తలు, అనుచరులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, నియోజకవర్గ ముఖ్య నేతలతో బోడే ప్రసాద్ మంతనాలు జరుపుతున్నారు.