అమెరికా నుంచి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ షెడ్యూల్ ఇదే..

Update: 2019-08-20 01:20 GMT

అమెరికా నుంచి వచ్చాక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనధికారికాకంగా ఖరారైంది. ఆయన వచ్చేనెల 1న శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతున్న రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఆయన సిక్కోలు నుంచే శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబరు 1న నరసన్నపేట లేదా పోలాకి మండలం ఈదులవలసలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాకు వెళుతున్నారు. 

Tags:    

Similar News