రేపు మల్లాడి కృష్ణారావు నివాసానికి ముఖ్యమంత్రి జగన్

Update: 2019-11-20 06:59 GMT

రేపు(గురువారం) తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముమ్మడివరం డిగ్రీ కళాశాల నిర్మాణానికి, ఎదుర్లంక ఎస్సీ లంక భూముల్లో రూ.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (జీఎస్‌పీసీ) ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.78.22 కోట్లు పరిహారం అందజేయనున్నారు.

అంతేకాదు ఐ.పోలవరం మండలం. పశువుల్లంక నుంచి వలసలతిప్ప హై లెవెల్‌ బ్రిడ్జి (వైఎస్సార్‌ వారధి)ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.25 గంటలకు పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి వెళ్లి ఇటీవల మరణించిన కృష్ణారావు తండ్రి మల్లాడి సూర్యనారాయణకు శ్రద్ధాంజలి ఘటిస్తారని సీఎంఓ వెల్లడించింది. 

Tags:    

Similar News