కాసేపట్లో గవర్నర్‌తో భేటీకానున్న సీఎం జగన్

Update: 2020-03-30 10:03 GMT

ఏపీలో కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో సీఎం జగన్ సాయంత్రం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుస్తారు సీఎం జగన్. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్ పరిస్థితులను గవర్నర్‌కు వివరించనున్నారు సీఎం జగన్. రాష్ట్రంలో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఈ సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ.. కరోనా నివారణకు పకడ్బందీగా చర్యలు చేపడుతోంది ఏపీ ప్రభుత్వం. 

 

Tags:    

Similar News