CM Jagan: ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్

CM Jagan: ఐదు రోజులు పూర్తి చేసుకున్న జగన్ యాత్ర

Update: 2024-04-01 15:57 GMT

CM Jagan: ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్

CM Jagan: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముమ్మరం అయ్యింది. అధికార ప్రతిపక్ష నేతలంతా రోడ్ షోలు, బహిరంగ సభలతో జనంలో తిరుగుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ద్వారా సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర శనివారం రాత్రికి అనంతపురం జిల్లా సంజీవపురంకి చేరుకుంది. యాత్ర ఆగిన ప్రాంతం నుంచి సోమవారం సీఎం జగన్ బయలుదేరనున్నారు. పలు ప్రాంతాలు పర్యటిస్తూ సాయంత్రానికి కదిరికి చేరుకున్నారు. అక్కడ ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొన్నారు.

Tags:    

Similar News