జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
`జగనన్న విద్యా కానుక` కింద ఇవ్వనున్న 6 రకాల వస్తువులు.. (3 జతల యూనిఫాం, షూ, సాక్స్, బెల్ట్, బ్యాగ్, నోట్బుక్స్, టెక్ట్స్బుక్స్) పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీ చేయాలని అధికారులను
పేద విద్యార్దుల చదువు కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద లాంటి పథకాలను ప్రవేశపెట్టిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు 'జగనన్న విద్యా కానుక' కింద ఇవ్వనున్న 6 రకాల వస్తువుల (3 జతల యూనిఫాం, షూ, సాక్స్, బెల్ట్, బ్యాగ్, నోట్బుక్స్, టెక్ట్స్ బుక్స్)ను పాఠశాలలు తెరిచే సరికి పిల్లలకు పంపిణీ చేయాలని అధికారులకు సూచించింది. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ 'జగనన్న విద్యా కానుక' కిట్ లో ఆరు రకాల వస్తువులు ఉండాలని అధికారులకు సూచించారు.