ఈవీఎంలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 శాతం ఈవీఎంలు పనిచేయక పోవడం - 3 గంటల సమయం వృధా అయిందని కొన్ని చోట్ల రీపోలింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ ను కోరారు చంద్రబాబు. కొన్నిచోట్ల తెలుగుదేశానికి ఓటు వేస్తుంటే వైసీపీకి వెళుతోందని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది చాల దురదృష్టకర పరిణామం. పోలింగ్ ప్రారంభించి మూడు గంటలు దాటినా ఈవీఎంలు పనిచేయడం లేదని .. అనేక ప్రాంతాల నుంచి ఈవీఎంలు పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.