ఇన్సైడర్ ట్రేడింగ్పై సీఐడీ దూకుడు.. ఏడుగురిపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు !
విజయవాడలో ఇన్సైడర్ ట్రేడింగ్పై సీఐడీ దూకుడు పెంచింది. ఏడుగురిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. తెల్లరేషన్కార్డు దారుల పేర్లతో కోట్లాది రూపాయల భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. నాగమణి, నరసింహారావు, అనురాధ, కొండలరావు, భూక్యానాగమణి, అబ్దుల్, జమేదార్లపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరికొందరి ప్రమేయంపై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.