టీడీపీకి రాజీనామా చేసిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి

Update: 2019-02-13 04:54 GMT

చీరాల నియోజకవర్గంలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. జగన్ తో చర్చించేందుకు ఆమంచి లోటస్ పాండ్ కు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుకు పంపించించారాయన. గతవారం చంద్రబాబుతో సమావేశం అయిన తర్వాత కూడా ఆయన మొత్తబడలేదు. పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని చెబుతూ వచ్చారు. దీంతో ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. 

Similar News