రామతీర్థం ఘటన బిజెపి గూండాల పనే - చింతామోహన్

* రాజకీయాల కోసం దేవుళ్ళను వాడుకోవడం మంచి పద్దతి కాదు * త్వరలో మరిన్ని ఆలయాలపై దాడులకు ప్లాన్ చేస్తున్నారు

Update: 2021-01-03 08:08 GMT

రామతీర్థం ఘటన బిజెపి గూండాల పనేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ ఆరోపించారు. జగన్, చంద్రబాబులకు ఆ విషయం చెప్పే దమ్ములేదని చింతా మోహన్ అన్నారు.త్వరలో శ్రీకాళహస్తి, వెంకటగిరిలో కూడా ఇలాంటి స్కెచ్ లు వేసినట్లు అనుమానాలున్నాయని ప్రభుత్వానికి సూచించారు.వెంకటగిరి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో స్కెచ్ వేసినట్లు తెలుస్తోందని అన్నారు. రాజకీయాల కోసం దేవుళ్ళను వాడుకుంటున్నారని ఇది మంచి పద్దతి కాదని మండి పడ్డారు.

Tags:    

Similar News