జనసేనలో చేరిన చంద్రశేఖర్

Update: 2019-01-04 03:58 GMT

ప్రముఖ పారిశ్రామికవేత్త గిద్దలూరు కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్‌ యాదవ్‌ గురువారం జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్. 2009 ఎన్నికల్లోకాంగ్రెస్ తరుపున పోటీ చేసిన చంద్రశేఖర్ 8వేల ఓట్ల తేడాతో ప్రజారాజ్యం అభ్యర్థి అన్నా రాంబాబుపై ఓటమి చవిచూశారు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2014 లో వైసీపీ టికెట్ కు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ కుదరలేదు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం చేసే వరకూ గిద్దలూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు.

తదనంతర పరిణామాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒంగోలులో చంద్రశేఖర్‌ మోటార్స్‌ పేరిట వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాగా పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన చంద్రశేఖర్.. జనసేన సిద్ధాంతాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరానని చెప్పారు. త్వరలోనే పవన్‌కల్యాణ్‌ ప్రకాశం జిల్లా పర్యటన ఉంటుందని, అప్పుడు మరికొందరు పార్టీలో చేరుతారని ఆయన చెప్పారు.  

Similar News