కుప్పం పర్యటనలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Update: 2021-02-25 09:57 GMT

కుప్పం పర్యటనలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నన్న అధికార పార్టీ నేతలు భయపెట్టాలని చూస్తున్నారన్న చంద్రబాబు నేను ఎవరికీ భయపడను ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. వైసీపీ చేస్తున్న అరాచకాలు అన్నీరాసుకుంటున్నానన్న చంద్రబాబు త్వరోలోనే చక్రవడ్డీతో సహా తిరిగిచ్చేస్తా అంటూ హెచ్చరించారు. వైసీపీ నేతల దౌర్జన్యాలకు ఎదురొడ్డి విజయం సాధించడం అభినందనీయమన్నారు. పంచాయితీ ఎన్నికలు దౌర్జన్యాలతో జరిపించారని మండిపడ్డారు. తాము బలపరిచిన అభ్యర్థులను అన్ని విధాలా భయపెట్టారని, కుప్పంలో ఏదో సాధించామని విర్రవీగుతున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News