రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

Update: 2020-03-10 13:17 GMT

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తరఫున అభ్యర్థిని ప్రకటించారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తమ పార్టీ తరఫున వర్ల రామయ్యను బరిలో నిలుపుతున్నామని చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఈ మేరకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు.

అసలు వైసీపీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో..? తెలుసుకోవాలని తప్పని భావిస్తే వర్లకు ఓటెయ్యాలని బాబు సూచించారు. తప్పని తెలిసినా భయపడితే వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తారన్నారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేస్తామని, పార్టీ ఏజెంట్ కు చూపించి ఓటేయాలని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు.  

Tags:    

Similar News