హరికృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు

Update: 2019-08-18 10:59 GMT

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్ లోని దివంగత హరికృష్ణ ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా హరికృష్ణ ప్రధమ వర్ధంతిలో పాల్గొన్నారు. హరికృష్ణ చిత్రపటం ముందు పుష్ఫగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హరికృష్ణ తనయులు, నటులు జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ను పరామర్శించారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, పలువురు సినీరాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం చంద్రబాబు తన ఇంటికి వెళ్లారు. అందుబాటులో ఉన్న నేతలతో ఏపీలో వరదపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను ఆదుకోవాలని, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని నేతలకు సూచించారు. 

Tags:    

Similar News