Andhra Pradesh: దంపతులపై కూలిన సెల్‌ టవర్‌

Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

Update: 2021-04-05 13:44 GMT

Andhra Pradesh: దంపతులపై కూలిన సెల్‌ టవర్‌

Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పట్టణంలో తహశీల్దార్ కార్యాలయం సమీపంలో సెల్‌టవర్ కుప్పకూలింది. దాంతో కెఎన్ రోడ్డులో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురైంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై సెల్‌ టవర్‌ కూలి పడింది. ఈ ఘటనలో భర్త సతీశ్‌ (43) మృతిచెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News