MP Satyanarayana: కిడ్నాప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి

MP Satyanarayana: డబ్బు కోసం ప్రముఖులకు సైతం కిడ్నాపర్లు ఫోన్‌లు చేశారు

Update: 2023-06-21 11:48 GMT

MP Satyanarayana: కిడ్నాప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి

MP Satyanarayana: తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎంపీ ఎంవీవీ. సీబీఐ విచారణకు ఆదేశిస్తే సహకరిస్తానని స్పష్టం చేశారు. కిడ్నాప్ వెనుక రాజకీయ కారణాలు, రియల్‌ఎస్టేట్ లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలను ఆయన ఖండించారు. డబ్బు కోసం ప్రముఖులకు సైతం కిడ్నాపర్లు ఫోన్‌లు చేసినట్లు ఎంవీవీ తెలిపారు. ఇక కిడ్నాప్ ఇష్యూను రాజకీయం చేయడం సరికాదన్నారు ఎంవీవీ. విశాఖ ప్రజలకు రక్షణే లేదన్నట్లు కొంతమంది మాట్లాడుతున్నారని.. వాళ్లు అనుకున్నట్లు ఏమీ లేదని.. వైజాగ్‌ ప్రశాంతంగానే ఉందన్నారు ఎంవీవీ..

Tags:    

Similar News