ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) రద్దు చేసింది. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు కృష్ణ కిశోర్కు తిరిగి క్యాట్ అనుమతిచ్చింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జాస్తి కృష్ణ కిశోర్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో కృష్ణ కిశోర్ అప్పీళ్లను పరిశీలించిన క్యాట్ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై తొలుత స్టే విధించింది.
కాగా.. జగన్ సర్కార్ కృష్ణ కిశోర్పై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. కృష్ణ కిశోర్పై అవినీతి ఆరోపణలు సంబంధించి పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ ప్రభుత్వం నివేదిక తెప్పించింది. అనంతరం కృష్ణ కిశోర్పై కేసు నమోదు చేయాలని సీఐడీ, ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది. . కృష్ణ కిశోర్ అవినీతి ఆరోపణలపై ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. విచారణ పూర్తయ్యేవరకు అమరావతి విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. అనతంరం ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా కృష్ణ కిశోర్ టీడీపీ ప్రభుత్వంలో పని చేశారు. అప్పటి సీఎం చంద్రబాబు ఆయన్ను మూడేళ్ల పదవీకాలానికి ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా కృష్ణ కిశోర్ను నియమించారు. 1990 బ్యాచ్కు చెందిన కృష్ణ కిశోర్ గతంలో టీడీపీ సినీయర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజు వద్ద సెక్రటరీగా విధులు నిర్వర్తించారు.