పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ తొందరపాటు చర్య-బొత్స

*చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు ఎక్కువగా వచ్చాయి *ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి-బొత్స

Update: 2021-02-05 15:51 GMT

బొత్స సత్యనారాయణ ఫైల్ ఫోటో 

రాజ్యాంగానికి, చట్టానికి అనుగుణంగా పంచాయతీ ఎన్నికలు జరుపుకుంటున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవలు ఎక్కువగా వచ్చాయని, వాటి మీద రిపోర్ట్ పంపించాలని కమిషనర్ అడిగారని...కొంచెం తొందరపాటుగా అడిగారని భావిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. ప్రజలు యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఎస్‌ఈసీ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యన్నారాయణ. ప్రభుత్వంతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News