బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుమారుడి వివాహ నిశ్చితార్థం దుబాయ్లో ఆదివారం జరగనుంది. నిశ్చితార్థానికి 70 మంది దాకా ఎంపీలు, టీడీపీ, బీజేపీ నేతలు హాజరుకానున్నారు. వారంతా ఈ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లారు. వారికోసం కోసం ఏకంగా 15 విమానాలను దుబాయ్ కి బుక్ చేశారు. కడప జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలకు కూడా ఆహ్వానాలు అందాయి.
వారు ఈ కార్యక్రమానికి వెళతారో లేదో అన్న అనుమానం ఉండగా.. వైసీపీ లోక్ సభా పక్ష నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరుకాకున్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు సీఎం రమేష్ సన్నిహితులు మూడు రోజుల ముందే దుబాయ్ చేరినట్టు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే దుబాయ్లో ల్యాండ్ అయ్యారు.