Somu Veerraju: వైసీపీ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తోంది : సోము వీర్రాజు

Somu Veerraju: వైసీపీపై బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Update: 2022-01-27 07:22 GMT

Somu Veerraju: వైసీపీ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తోంది

Somu Veerraju: వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందని, బి జె పి పాలనతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకే,ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు ను 62 కి పెంచిందన్నారు.. ఉద్యోగుల విషయాన్ని పక్కకు నెట్టెందుకే ..26 జిల్లాల కధను ముఖ్యమంత్రి ముందుకు తీసుకొచ్చారు. .స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నిర్ణయం చెప్పింది. రాష్ట్ర బి జె పి స్టీల్ ప్లాంట్ ప్రై వేటికరణకు వ్యతిరేకం.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రామతీర్థంలో రాముడు తల నరికితే ఏంచేశారు.ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?వైసీపీ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. వైసీపీ ప్రభుత్వం గోవా సంస్కృతిని రాష్రానికి అలవాటు చేసింది.వైసీపీ ది ,క్యాసినో పార్టీ.ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పి ఆర్ సి వలన ఉద్యోగులకు జీతాలు తగ్గిపోతున్నాయి.

Tags:    

Similar News