స్థానిక ఎన్నికల ప్రక్రియ రద్దు చేయండి: గవర్నర్ కి కన్నా లేఖ

ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ రాశారు.

Update: 2020-04-27 09:11 GMT

ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ లేఖ రాశారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన స్థానిక ఎన్నికల ప్రక్రియలో లోపాలున్నాయని పేర్కొన్నారు.. అధికార పార్టీ ఒత్తిళ్లతో ప్రతిపక్ష నేతలు నామినేషన్లు వేయలేకపోయారని కన్నా పేర్కొన్నారు.

దాడులు, దౌర్జన్యాలతో అధికార పార్టీ చాలా చోట్ల ఏకగ్రీవం చేసుకుందని కన్నా ఆ లేఖలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి నిర్వహించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అయన కోరారు. ఇక కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News