Balineni Srinivasa Reddy: ఎంపీ సీటు మాగుంటకు ఇవ్వాలని పట్టుబడుతున్న బాలినేని

Balineni Srinivasa Reddy: మరోసారి బాలినేనితో చర్చలు జరిపిన సజ్జల.. ఒంగోలు ఎంపీపై క్లారిటీ ఇవ్వనున్న వైసీపీ అధిష్టానం

Update: 2024-01-30 13:45 GMT

Balineni Srinivasa Reddy: ఎంపీ సీటు మాగుంటకు ఇవ్వాలని పట్టుబడుతున్న బాలినేని

Balineni Srinivasa Reddy: ఎంపీ బాలినేనిపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల వ్యవహారంతో.. ఎంపీ బాలినేని వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఒంగోలు ఎంపీ స్థానం మాగుంటకు ఇవ్వాలని గత కొంత కాలంగా బాలినేని పట్టుడుతున్నారు. అయితే.. మాగుంటపై వైసీపీ అధిష్టానం సుముఖంగా లేదు. దీంతో మాగుంటకు సీటు ఇచ్చేదేలేదని.. సీఎం జగన్ తేల్చి చెప్పారు. అప్పటి నుంచి ఒంగోలు ఎంపీ సీలు మాగుంటకు ఇవ్వకుంటే..తాను పోటీ చేయనని.. బాలినేని తేల్చి చెప్పారు. కాగా.. ఇప్పటికే పలుమార్లు సీఎం జగన్‌తో బాలినేని చర్చలు జరిపినా.. పరిస్థితిలో మార్పు రాలేదు. మరోసారి బాలినేనితో సజ్జల చర్చించారు. అయినా.. బాలినేని పట్టువదలనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒంగోలు ఎంపీ సీటుపై వైసీపీ అధిష్టానం నిర్ణయం ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News