Minister Avanti Srinivas (file Image)
విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై కక్షసాధింపు ధోరణితో కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని ఆంధ్రులు దేశంలో పౌరులు కాదా అంటూ ప్రశ్నించారు.