గోదావరి వరదలో చిక్కుకున్న ఎస్‌ఐ

Update: 2019-07-09 10:03 GMT

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్న జేసీబీ వరద నీటిలో చిక్కుకుపోయింది. జేసీబీ డ్రైవర్‌ను కాపాడేందుకు వెళ్లిన పోలీసులు కూడా వరదలో చిక్కుకుపోయారు. ఆత్రేయపురం ఎస్సై నదిలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు నాటు పడవలో బయలుదేరారు. అయితే ఇసుక దిబ్బల కారణంగా ఆయన బోటు కూడా వరదలో చిక్కుకుపోయింది. దీంతో రావులపాలెం నుంచి బయలుదేరిన అగ్నిమాపక సిబ్బంది నదిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే జేసీబీని బయటకు తీసుకురావడంలో మాత్రం కొద్దిపాటి ఆలస్యం జరిగింది.

Tags:    

Similar News