ఏపీలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి ఏపీలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది.