బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత

Update: 2019-06-18 11:35 GMT

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కొత్తపల్లి గీత బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నేతృత్వంలో ఆమె కమలం గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా కనిపిస్తోందని అన్నారు. తాను స్థాపించిన జన జాగృతి పార్టీని త్వరలో బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు. విభజన హామీల సాధనకు తన వంతు కృషి చేస్తానని కొత్తపల్లి గీత అన్నారు. 




 





 


Tags:    

Similar News