ఏపిలోని ఆటో , క్యాబ్ డ్రైవర్ లకు శుభవార్త ..

Update: 2019-07-16 05:38 GMT

ఆంధ్రప్రదేశ్ లోని ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు శుభవార్తని అందజేసింది ఏపి ప్రభుత్వం .. త్వరలో ఆటో డ్రైవర్ కమ్ ఓనర్ కి పదివేయిల రూపాయలు ఇవ్వన్నున్నట్లు తెలిపింది . ఈ మేరకు మంగళవారం రక్షణశాఖ మంత్రి పేర్నీ నాని ఓ ప్రకటను విడుదల చేసారు.. వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఆటో డ్రైవర్ల బాధలు తెలుసుకున్నారని ఈ మేరకు మూడు చక్రాల ఆటో డ్రైవర్లకు పది వెయిలు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని అందుకు తగ్గట్టే అ హామీలను నేరవేరుస్తున్నట్లు అయన చెప్పారు . దీనికోసం నాలుగు వందల కోట్లు ఖర్చు కేటాయిస్తున్నామని అంతకుమించి ఎక్కువ అయిన ఇస్తామని అన్నారు . నిజానికి ఎన్నికలకు ముందు కేవలం మూడు చక్రాల ఆటో డ్రైవర్లకు మాత్రమే ఈ హామీ ఇచ్చామని కానీ ఇప్పుడు దానిని వాటితో పాటు కార్లకు ,టాక్సీ డ్రైవర్ లకు కూడా ఇస్తున్నామని అయన అసెంబ్లీలో తెలిపారు .. త్వరలోనే ఇవి డ్రైవర్ లకు అందజేస్తామని అయన తెలిపారు .. 

Tags:    

Similar News