సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలు అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. గతంలో వైఎస్సార్ హయాంలో ఎలాంటి భరోసా కల్పించారో అలాంటి భరోసా అందిస్తామన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10 వేల రూపాయల పింఛను అందించనున్నట్టు చెప్పారు బొత్స. అవినీతిరహిత పాలన అందిస్తామని జగన్ చెప్పారని గుర్తుచేశారు. రూ. వెయ్యి దాటితే వైద్య ఖర్చులన్నీ భరిస్తామని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.