ఇంత దుర్మార్గంగా రాజకీయ విమర్శలు చేయడం సరికాదు: మంత్రి అనిల్‌

Update: 2019-08-19 11:12 GMT

ఏపీలో క్రమక్రమంగా వరద తగ్గుముఖం పడుతోందని ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్‌యాదవ్‌ అన్నారు. వరద పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం పూర్తిగా కంట్రోల్‌‌లో ఉందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి వివరించారు. కృష్ణా కరకట్టపై ఇళ్లను ముంచేందుకు మ్యాన్ మేడ్‌ ఫ్లడ్స్‌ ను సృష్టించారన్న ఆరోపణలను ఖండించిన మంత్రి అనిల్ ఇంత దుర్మార్గంగా రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు.

Full View 

Tags:    

Similar News