పల్నాడులో ఏదో జరిగిపోతోందంటూ టీడీపీ కృత్రిమ భయాందోళనలను సృష్టిస్తోందని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత గుంటూరు జిల్లాలో జరిగిన దాడులను పరిశీలిస్తే టీడీపీ కంటే వైసీపీ కార్యకర్తలపైనే ఎక్కువ అటాక్స్ జరిగాయని కేసులతో సహా వివరించారు. టీడీపీ నేతలే దాడులుచేసి మళ్లీ వాళ్లే వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో రాక్షస పాలన కొనసాగిందని హోం మంత్రి చెప్పుకొచ్చారు.