పోలవరం కాంట్రాక్టు రద్దుపై ముగిసిన వాదనలు
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేయడాన్ని సవాలుచేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నవయుగ సంస్థ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేయడాన్ని సవాలుచేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నవయుగ సంస్థ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఏపీ ప్రభుత్వం, నవయుగ సంస్థ తమతమ వాదనలు వినిపించడంతో తీర్పును హైకోర్టు రిజర్వులో పెట్టింది. తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, కారణం లేకుండా కాంట్రాక్టును ఎలా రద్దు చేస్తారని నవయుగ వాదించగా కాంట్రాక్టు రద్దుచేస్తే ఆర్బిటేషన్కి వెళ్లాలే గానీ, హైకోర్టును ఆశ్రయించడం సరికాదంటూ సర్కారు వాదనలు వినిపించింది.